మహబూబ్నగర్:మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మహబూబ్నగర్ లో ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటు ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని సీఎంను కోరాలని ఉందన్నారు. 24 గంటల కరెంట్ కాకుండా.. 3 గంటల కరెంట్ మాత్రమే ఇవ్వాలని కోరుతానని లక్ష్మారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాలను ప్రస్తుతం నిలిపివేసి.. ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుందని తెలిపారు లక్ష్మారెడ్డి.
