ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ తిరిగి ప్రారంభమైంది. ఆదివారం ( నవంబర్ 16)లాల్ ఖిలా మెట్రో స్టేషన్ ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తెలిచారు అధికారులు. ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు పేలుడు తర్వాత భద్రతా దృష్ట్యా లాల్ఖిలా మెట్రో స్టేషన్ ను మూసివేశారు. ఆరు రోజులు తర్వాత తిరిగి ఈ రోజు ప్రయాణికులకు మెట్రో సేవలను పునరుద్దరించినట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషనే (DMRC) తెలిపింది.
ఎర్రకోట(లాల్ఖిలా) మెట్రోస్టేషన్ ఓపెన్ చేయడం కాశ్మీరీ గేట్ నుంచి రాజా నవహర్సింగ్ ప్రాంతం వరకు వైలెట్ లైన్లో ప్రయాణికులకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటుంది. ఎర్రకోట ,పాత ఢిల్లీ ప్రాంతాలకు వెళ్లే రోజువారీ ప్రయాణికులు, పర్యాటకులు ,స్థానిక నివాసితులకు పూర్తి కనెక్టివిటీని ఉంటుందని DMRC తెలిపింది.
నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు బాంబు బ్లాస్ట్ లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో భద్రతా దృష్ట్యా ఎర్రకోట మెట్రో స్టేషన్ ను డీఎంఆర్ సీ మూసివేసింది. ఢిల్లీలో శాంతి భద్రతలు తిరిగి నెలకొనడంతో ఈ రోజు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.
