హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం ఢిల్లీలోని వసంత్ విహార్లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్థల కేటాయింపు డాక్యుమెంట్లను ఆర్ అండ్ బీ మినిస్టర్ వేముల ప్రశాంత్రెడ్డికి కేంద్ర ప్రతినిధులు ఢిల్లీలో బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మిస్తామన్నారు.