సిద్దిపేటలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

సిద్దిపేటలో  ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

సిద్దిపేట జిల్లా అక్కన్న పేట మండలం గుడాటిపల్లి గ్రామంలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజుల్లో గౌరవెల్లి ప్రాజెక్ట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు రెడీ అయ్యింది సర్కార్. ట్రయల్ రన్ ను అడ్డుకుంటారనే ఉద్దేశంతో ముందస్తుగా భూ నిర్వాసితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాదాపు వంద మందిని అరెస్ట్ చేసి.. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు.

భూ నిర్వాసితులను అరెస్ట్ చేసే టైంలో పోలీసులకు... గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరిగింది. ముందస్తు అరెస్టులను నిరసిస్తూ ఆందోళనకు దిగారు గ్రామస్తులు... దీంతో భూ నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు భూనిర్వాసితులకు గాయాలు అయ్యాయి. గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. మీడియాను గ్రామంలోకి అనుమతించటం లేదు.