దళితులను కేసీఆర్ మోసం చేసిండు..కూకట్ పల్లిలో కాంగ్రెస్ నిరసన

దళితులను కేసీఆర్ మోసం చేసిండు..కూకట్ పల్లిలో కాంగ్రెస్ నిరసన

ప్రతి నియోజకవర్గంలో  అర్హులైన దళితులకు దళిత బంధు పథకం అమలు చేయకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కూకట్ పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ డివిజన్‭లో మేడ్చల్ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పత్తి కుమార్, టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం ఆధ్వర్యంలో... దళిత వాడలలో దళిత కాంగ్రెస్ పేరిట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో పార్టీలకు అతీతంగా ప్రతి దళితుడికి పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల్ని మోసం చేశారని విమర్శించారు. 

అర్హులైన దళిత బంధు లబ్ధిదారులకు పథకం అమలు కాకపోతే... కాంగ్రెస్ నేతలకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో లబ్ధిదారులకు పథకం అమలయ్యే విధంగా చూస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు. దళితుల ఇండ్లలో నిద్రించి దళితులను చైతన్యవంతం చేస్తామని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కి బుద్ధి చెప్పే విధంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని తెలియజేశారు.