విద్యుత్ తీగలు తగిలి కాలిపోయిన లారీ..

విద్యుత్ తీగలు తగిలి కాలిపోయిన లారీ..

కృష్ణా జిల్లా మైలవరం దగ్గర ఓ లారీ మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. గణపవరం క్రాస్ రోడ్డు దగ్గర ఇటుకల బట్టీలో బూడిదను డంప్ చేసి వస్తున్న టిప్పర్ కు విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే డ్రైవర్ లారీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగా…. టిప్పర్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది.