హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ శుక్రవారం రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల ఆయనను ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఈమేరకు ఢిల్లీలోని రాజ్యసభ ఛాంబర్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లక్ష్మణ్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రమే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీ వెళ్లారు. మరి కొందరు పార్టీ సీనియర్ నేతలు శుక్రవారం ఉదయం ఢిల్లీ బయలుదేరనున్నారు.