దుష్ప్రచారం చేసిన కోటిపై చర్యలు తీసుకోవాలి: లక్ష్మీ పార్వతి

దుష్ప్రచారం చేసిన కోటిపై చర్యలు తీసుకోవాలి: లక్ష్మీ పార్వతి

తన పై కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి. తనపై దుష్ప్రాచారం   చేసిన కోటి అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డీజీపిని కోరారు. ‘ నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా కోటి అనే వ్యక్తి సామాజిక సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడు. గౌరప్రదమైన స్థాయిలో ఉన్న నన్ను అగౌర పరుస్తూ విమర్శలు చేస్తున్నారు. ఏప్రిల్ 4 తేదీన కోటి తప్పుడు ఆరోపణలు చేస్తూ టీవీ ఛానెల్స్, సోషియల్ మీడియాలో నా వ్యక్తిత్వాన్ని కించపరిచాడు.  నా పై ఆరోపణలు చేస్తున్న కోటి అనే వ్యక్తి ని బిడ్డలగా భావించాను. దీని వెనుక ఉన్న కుట్రను ను ఛేదించాలని ‘ లక్ష్మి పార్వతి ఫిర్యాదులో తెలిపారు.