రంగారెడ్డిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన.. 20ఏళ్ల జైలు శిక్ష

రంగారెడ్డిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన.. 20ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నెరస్థుడికి కోర్టు 20 యేండ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించిది.  2017లో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం దాతపల్లి గ్రామానికి చెందిన సపావత్ అంజిత్ కుమార్(28)..  అదే గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  ఘటనపై మంచాల పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు జరిపి.. ఆరేళ్ల తర్వాత సరైన సాక్ష్యాధారాలను ఎల్బీనగర్ లోని పొక్సో స్పెషల్ కోర్టుకు సమర్పించారు. 

విచారణ జరిపిన కోర్టు.. ఈ ఘటనలో నిందితుడిని నెరస్థుడిగా పరిగణిస్తూ.. 20 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఈ కేసులో నెరస్థుడికి శిక్షపడేలా చేసిన మంచాల సిఐ, ఎస్సై, కానిస్టేబుల్ లను రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ అభినందించినట్లు ఇబ్రహీంపట్నం ఏసీపి ఏఎస్ రావు మీడియా సమావేశంలో తెలిపారు.