అన్ని వర్గాలకు అండగా బీజేపీ : కిషన్ రెడ్డి

అన్ని వర్గాలకు అండగా బీజేపీ : కిషన్ రెడ్డి
  •     కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి

ముషీరాబాద్, వెలుగు : బీజేపీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని  కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  నల్లకుంట డివిజన్‌‌‌‌కు చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌తో పాటు వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు మాజీ మంత్రి కృష్ణ యాదవ్  ఆధ్వర్యంలో  ఆదివారం బీజేపీ సిటీ ఆఫీసులో  పార్టీలో చేరారు.

 ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో  బీజేపీ నగర సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు, నల్లకుంట కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ అమృత, శ్యామ్ రాజ్, ప్రశాంత్ జోషి, మోహన్ నాయుడు, సునీల్, సోమ్, అశ్విన్, భాస్కర్ యాదవ్, రాఘవేంద్ర,  వి నోద్, సుజిత్, శ్రీకాంత్  పాల్గొన్నారు.