భరత్ భూషణ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

 భరత్ భూషణ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

ప్రముఖ ఫొటో గ్రాఫర్, ఫొటో జర్నలిస్ట్ గుడిమల్ల భరత్ భూషణ్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తెలంగాణ పల్లె జీవితాన్ని, బతుకమ్మ పండుగను భరత్ భూషణ్ అద్భుతంగా చిత్రీకరించారు. భరత్ భూషన్ మృ తి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తన పొటోలతో తెలంగాణ ప్రజల జీవనశైలి, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. రాష్ట్రం అరుదైన చిత్రకారుడిని కోల్పోయిందన్నారు. కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మరిన్ని వార్తల కోసం

రేపటి నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు

 

ఐఏఎస్​, ఐపీఎస్​ వ్యవస్థలను  కేసీఆర్​ నాశనం చేసిండు