ఐఏఎస్​, ఐపీఎస్​ వ్యవస్థలను  కేసీఆర్​ నాశనం చేసిండు

ఐఏఎస్​, ఐపీఎస్​ వ్యవస్థలను  కేసీఆర్​ నాశనం చేసిండు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌‌‌‌‌‌‌‌, ఐపీఎస్ అధికారులను తొత్తులుగా వాడుకుంటోందని, దీనిపై పార్లమెంట్‌‌‌‌‌‌‌‌​ సమావేశాల్లో ప్రస్తావిస్తానని పీసీసీ మాజీ చీఫ్‌‌‌‌‌‌‌‌, ఎంపీ ఉత్తమ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. ఆదివారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా వ్యవహరించే అధికారులకే మంచి పోస్టింగులు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అక్రమాలకు సహకరించినందుకే రజత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ శాఖలో మంచి పోస్టింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ వ్యవస్థలను సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూర్తిగా నాశనం చేశారని మండిపడ్డారు.