అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డ చిరుత

అర్థరాత్రి ఇంట్లోకి చొరబడ్డ చిరుత

మహారాష్ట్రలో ఓ చిరుత పులి హల్ చల్ చేసింది. ఎవరూలేని సమయంలో ఇంట్లోకి చొరబడింది. ఊరంతా దుర్గాదేవి శోభయాత్రలో ఉండగా.. చిరుత పులి ఆగ్రామంలోకి ప్రవేశించి ఓ ఇంట్లో చొరబడింది. దుర్గాదేవి నిమజ్జనం అయిపోగానే తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు..చిరుత పులిని చూసి షాక్ అయ్యారు. భయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. అటవీశాఖ అధికారులు వచ్చి చిరుతను బంధించారు. దీంతో గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు.