సమన్వయంతో పనిచేద్దాం.. అభివృద్ధి అంటే ఏమిటో చూపుదాం : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ 

సమన్వయంతో పనిచేద్దాం.. అభివృద్ధి అంటే ఏమిటో చూపుదాం : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్ 
  • నగర పాలక మీటింగ్​లో టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్ ​గౌడ్​ 

నిజామాబాద్​, వెలుగు: రాజకీయలతో సంబంధం లేకుండా నిజామాబాద్​ నగరాన్ని సమన్వయంతో అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్సీ, టీపీసీసీ ప్రెసిడెంట్​ మహేశ్​కుమార్​ గౌడ్​ సూచించారు. మంగళవారం మేయర్​ఉమారాణి అధ్యక్షతన జరిగిన నగర పాలక జనరల్​బాడీ మీటింగ్​కు ఎక్స్​అఫీషియో హోదాలో ఆయన హాజరై ప్రసంగించారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, శానిటేషన్​మెరుగ్గా నిర్వహించాలని, పాలక సభ్యులు  అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. 

ఆర్వోబీ పనులపై రగడ

నగర శివారులోని మాధవనగర్​వద్ద ఆర్వోబీ నిర్మాణం కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు రిలీజ్​ చేయడంలేదని మరో ఎక్స్ అఫీషియో సభ్యుడు, అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. బ్రిడ్జి పూర్తయితే జిల్లా కేంద్రం మీదుగా హైదరాబాద్ ​వెళ్లే వారి సమస్యలు తీరుతాయన్నారు. అయితే వంద శాతం కేంద్రం నిధులతో మొదలైన అర్సాపల్లి ఆర్వోబీ పనులు ఎందుకు నత్తనడక సాగుతున్నయని రూరల్​ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రశ్నించారు.

భూసేకరణలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం వల్లనే పనులు ఆలస్యమవుతున్నయని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సమాధానం ఇచ్చారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నరని ఫైర్​ అయ్యారు. ప్రజా సమస్యలపై మున్సిపల్ కార్పొరేషన్ ​ఆఫీసర్లకు ఫోన్​చేస్తే స్పందించడంలేదని, అవమానకరంగా ఉందని బీజేపీ కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో నగరపాలన బడ్జెట్​పై చర్చించారు. ప్రతి డివిజన్​లో రూ.20 లక్షల పనులు చేపట్టాలని నిర్ణయించారు. అన్ని డివిజన్లలోని సమస్యలను కలిసి పరిష్కరించుకుందామని మేయర్​ఉమారాణి అన్నారు. కమిషనర్ దిలీప్​ కుమార్ పాల్గొన్నారు.