హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ తన యాన్యుటీ ప్లాన్ ‘జీవన్ శాంతి’ రేట్లను మార్చింది. ఈ నెల ఐదో తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. పెరిగిన యాన్యుటీ రేట్లతో ఈ ప్లాన్ అమ్మకానికి అందుబాటులో ఉంది. హై పర్చేజ్ ప్రైస్ కు ప్రోత్సాహకాన్ని రూ.వెయ్యికి రూ. మూడు నుంచి రూ.9.75 వరకు పెంచారు. కొనుగోలు ధర, వాయిదా కాలం ఆధారంగా వీటిని లెక్కిస్తారు. జీవన్ శాంతి ప్రీమియం ప్లాన్. ఇందులో పాలసీదారుడు సింగిల్/ లైఫ్ మధ్య ఏదో ఒకదానిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.
జాయింట్ లైఫ్ డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్ ఉద్యోగులు, స్వయం ఉపాధి వారి కోసం ఉపయోగపడుతుంది. వాయిదా కాలం తర్వాత భవిష్యత్లో సాధారణ ఆదాయాన్ని కోరుకునే వారికి ఇది అనువుగా ఉంటుంది. మిగులు డబ్బును పొదుపు చేయాలనుకునే వాళ్లకు కూడా బాగుంటుంది.