
- ట్రాఫిక్ రూల్స్ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు
- కసరత్తు మొదలెట్టిన రవాణా శాఖ
- పోలీసుల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఫోకస్
- త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం
- 7 నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసుల్లో 18 ,978 మంది లైసెన్స్లు రద్దు
హైదరాబాద్, వెలుగు: ట్రాఫిక్ రూల్స్ను తరుచూ బ్రేక్ చేస్తున్న వాహనదారులపై కొరడా ఝులిపించేందుకు రాష్ట్ర రవాణా శాఖ సిద్ధమైంది. సీసీ టీవీ ఫుటేజీలకు చిక్కుతున్నా, వేలకు వేలు ఫైన్లు పడ్తున్నా మళ్లీ తప్పుల మీద తప్పులు చేస్తున్న వారికి చెక్పెట్టేందుకు కసరత్తు మొదలుపెట్టింది. వరుసగా 3 నెలలపాటు ట్రాఫిక్ చలాన్లు పెండింగ్పెట్టినవారి డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయాలని భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ట్రాఫిక్ పోలీసుల నుంచి తాజాగా వచ్చిన ప్రతిపాదనలపై రవాణా శాఖ సీరియస్గా దృష్టిపెట్టింది.
2 జిల్లాల పరిధిలోనే 10 వేల లైసెన్స్లు సస్పెండ్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్తున్న వాహనాదారులపై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 25 వరకు 18, 973 మంది డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేసినట్లు ఆ శాఖ అధికారులు ప్రకటించారు. ఇందులో డ్రంకెన్ డ్రైవ్లో చిక్కినవారు, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసిన వాహనదారులు ఉన్నట్లు వెల్లడించారు. సుమారు 10 వేల మందికిపైగా హైదరాబాద్ , ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందినవారే కావడం గమనార్హం.
మరోవైపు ట్రాఫిక్రూల్స్ ఉల్లంఘిస్తున్న చాలా మంది చలాన్లు కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. చలానా జనరేట్అయిన తర్వాత ట్రాఫిక్పోలీసుల నుంచి వాహనదారుల నంబర్లకు మెసేజ్పంపుతున్నారు. కానీ కొందరు వాహనాదారులు నెలలు, ఏండ్ల కొద్దీ ఫైన్లు చెల్లించడం లేదు. ఎప్పుడైనా పోలీసుల తనిఖీల్లో పట్టుబడినప్పుడు ఒక్కోవాహనంపై వేల రూపాయల ఫైన్లు ఉంటున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఆ మొత్తం కట్టలేక తమ వాహనాలను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారని పోలీసులు చెప్తున్నారు.
లైసెన్స్ సస్పెన్షన్పై సర్కారుకు నివేదిక
ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్నవారిని గాడినపెట్టాలంటే ఎప్పటికప్పుడు ఫైన్లు వసూలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక్కో వాహనదారుడి బండిపై 3 నెలలకు పైగా ఫైన్లు పెండింగ్లో ఉంటే వారి డ్రైవింగ్ లైసెన్స్లను సస్పెండ్ చేయించాలనే ప్రతిపాదనను రవాణా శాఖ అధికారుల ముందు ఉంచారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి అందించిన ప్రపోజల్స్ సాధ్యాసాధ్యాలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు త్వరలో నివేదిక రెడీ చేసి సర్కారుకు అందజేయనున్నట్లు తెలిసింది. ఇది గనుక అమలైతే ట్రాఫిక్రూల్స్ అతిక్రమించేవారికి కళ్లెం వేయడంతోపాటు ఫైన్లను ఎప్పటికప్పుడు క్లియర్చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు.