భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు

ఎల్​బీనగర్: భర్తను చంపిన భార్యకు జీవిత ఖైదు విధిస్తూ ఎల్​బీనగర్​లోని రంగారెడ్డి జిల్లా రెండో అదనపు కోర్టు తీర్పునిచ్చింది. నల్గొండ జిల్లాకు చెందిన ప్రవళ్లిక, మెండం పుల్లయ్య భార్యాభర్తలు. ఓ మైనర్​తో వివాహేతర సంబంధం పెట్టుకున్న ప్రవళ్లిక.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు స్కెచ్ వేసింది. ప్లాన్​ప్రకారం 2016 మే 26న రాత్రి భర్త పుల్లయ్యతో గొడవపడి తన ప్రియుడితో కలిసి భర్తపై దాడిచేసి చంపేసింది. తర్వాత డెడ్​బాడీని ఇద్దరూ కలిసి నల్గొండ వైపు బైక్​పై తీసుకెళ్తుండగా.. 

పెద్ద అంబర్​పేట నైట్ పెట్రోలింగ్ పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. కేసు ఫైల్ చేసి ఎల్​బీనగర్​కు బదిలీ చేశారు. ప్రవళ్లిక తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు తేల్చిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కేసు విచారణలో భాగంగా సోమవారం మహిళను ప్రధాన నిందితురాలిగా గుర్తించిన రంగారెడ్డి జిల్లా రెండో అదనపు కోర్టు.. ఆమెకు జీవిత ఖైదు, రూ.వెయ్యి ఫైన్ విధిస్తూ తీర్పు చెప్పింది.