డిసెంబర్ 31న అర్ధరాత్రి దాకా లిక్కర్ సేల్స్.. ఇవాళ్టి (డిసెంబర్ 24) నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్

డిసెంబర్ 31న  అర్ధరాత్రి దాకా లిక్కర్ సేల్స్.. ఇవాళ్టి (డిసెంబర్ 24) నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్
  • వైన్స్​లో 12 గంటల వరకు, బార్లు, పర్మిటెడ్ ఈవెంట్లలో ఒంటి గంట దాకా సర్వ్
  • ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ ఉత్తర్వులు జారీ
  • నాన్ పెయిడ్ లిక్కర్, డ్రగ్స్ రవాణా అరికట్టేందుకు స్పెషల్ డ్రైవ్

హైదరాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల టైంను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రొహిబిషన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ కమిషనర్‌‌‌‌‌‌‌‌ సి.హరికిరణ్‌‌‌‌‌‌‌‌ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31న మద్యం దుకాణాలు (ఏ -4 షాపులు) అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 

బార్లు, క్లబ్‌‌‌‌‌‌‌‌లు, పర్యాటక ప్రాంతాల్లోని హోటళ్లు, ప్రత్యేక అనుమతి తీసుకున్న ఈవెంట్లలో రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలు, సప్లైకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. వేడుకల మాటున ఎలాంటి అక్రమాలు జరగకుండా ఎక్సైజ్ శాఖ అప్రమత్తమైంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ షానవాజ్‌‌‌‌‌‌‌‌ ఖాసీం హెచ్చరించారు. ఈ నెల 27 నుంచే రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 27, 28, 29వ తేదీల్లో ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించనున్నాయి. 

ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌‌‌‌‌‌‌‌, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌, గంజాయి, డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ రవాణాపై ఉక్కుపాదం మోపనున్నారు. వరంగల్‌‌‌‌‌‌‌‌, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ జిల్లాల్లో నాటుసారా (ఐడీ లిక్కర్‌‌‌‌‌‌‌‌) తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. డిసెంబర్ 30, 31వ తేదీల్లో నిఘాను కట్టుదిట్టం చేయనున్నారు. ప్రత్యేక ఈవెంట్‌‌‌‌‌‌‌‌లు, పబ్బులపై తనిఖీలతో పాటు అక్రమ మద్యం అమ్మకాలను అడ్డుకోనున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లోని 20 చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులను ఇప్పటికే అప్రమత్తం చేశారు. 

  • ఇయ్యాల్టి (డిసెంబర్ 24) నుంచి జనవరి 1 దాకా స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్
  • హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు: సీపీ సజ్జనార్


హైదరాబాద్ సిటీలో బుధవారం (డిసెంబర్ 24)  నుంచి జనవరి 1 వరకు డ్రంకెన్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌లు నిర్వహిస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, న్యూ ఇయర్ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసు అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ‘‘డిసెంబర్ 31 రాత్రి హైదరాబాద్ సిటీలోని 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడ్తాం. 

ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నం. న్యూ ఇయర్ వేడుకల జోష్​లో మోతాదుకు మించి మద్యం తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వెహికల్ సీజ్​తో పాటు రూ.10 వేల జరిమానా, 6 నెలల జైలు శిక్షపడే అవకాశం ఉంటది’’అని సజ్జనార్ హెచ్చరించారు. రోడ్లపై యువత రేసింగ్‌‌‌‌‌‌‌‌లు, వీలింగ్‌‌‌‌‌‌‌‌లు, ర్యాష్‌‌‌‌‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

బార్లు, క్లబ్​లు, ఈవెంట్లు, పబ్‌‌‌‌‌‌‌‌లు, త్రీస్టార్‌‌‌‌‌‌‌‌, ఆపై స్థాయి హోటళ్లలో జరిగే వేడుకలకు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకే అనుమతి ఉంటుందన్నారు. వైన్‌‌‌‌‌‌‌‌ షాపులకు రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి ఇచ్చామని తెలిపారు. మహిళల భద్రత కోసం రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్టీ వెన్యూలు, జంక్షన్‌‌‌‌‌‌‌‌లలో మ‌‌‌‌‌‌‌‌ఫ్టీలో 15 షీ టీమ్స్‌‌‌‌‌‌‌‌ తో నిఘా ఉంచుతాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో అద‌‌‌‌‌‌‌‌న‌‌‌‌‌‌‌‌పు సీపీ (క్రైమ్స్) ఎం.శ్రీనివాసులు, డీసీపీల శ్వేత‌‌‌‌‌‌‌‌, ర‌‌‌‌‌‌‌‌క్షితా మూర్తి, రూపేశ్, తదితరులు పాల్గొన్నారు.