లిక్కర్ వ్యాన్​ బోల్తా..రోడ్డుపై పారిన మద్యం

లిక్కర్ వ్యాన్​ బోల్తా..రోడ్డుపై పారిన మద్యం

మల్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్​కే ఇంజినీరింగ్​కాలేజీ వద్ద బుధవారం సాయంత్రం కరీంనగర్-జగిత్యాల మెయిన్​రోడ్డుపై లిక్కర్​వ్యాన్ బోల్తా పడింది. కరీంనగర్ నుంచి కోరుట్ల వెళ్తూ అదుపు తప్పి బోల్తా పడడంతో లిక్కర్​ సీసాలు పగిలి రోడ్డుపై మద్యం పారింది. 

రూ.30 లక్షల విలువైన లిక్కర్​లో 60 శాతం మట్టిపాలైంది. వ్యాన్​లో డ్రైవర్​తో పాటు మరో నలుగురు ఉండగా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంతో ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో సిబ్బంది క్లియర్ చేశారు.