బావర్చి బిర్యానిలో బల్లి.. హోటల్ సిబ్బంది నిర్వాకం

బావర్చి బిర్యానిలో బల్లి.. హోటల్ సిబ్బంది నిర్వాకం
  •     మేనేజ్ మెంట్ కు చెప్పినా పట్టించుకోలేదు
  •     బాధితులు, ఎమ్మార్పీఎస్ నేతల ఆందోనళ

ముషీరాబాద్,వెలుగు : ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్​ బిర్యానీలో బల్లి రావడంతో తీవ్ర కలకలం రేపిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. అంబర్ పేటకు చెందిన విశ్వ ఆదిత్య చికెన్ బిర్యాని కోసం జొమాటో యాప్ ద్వారా బావర్చిలో బిర్యాని ఆర్డర్ చేశాడు. ఇంటికి పార్సిల్ వచ్చిన తర్వాత తెరిచి చూసేసరికి బిర్యానిలో బల్లి కనిపించింది. దీంతో భయాందోళన చెందిన విశ్వ ఆదిత్య తన తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు హోటల్​వద్దకు వెళ్లి నిర్వాహకులను అడగగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

దీంతో వారు ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకుని ఎమ్మార్పీఎస్ నేతలు రమేష్ కుమార్, రాజు, తదితరులు వెళ్లి మద్దతు తెలిపారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా హోటల్లో జరిగినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఫుడ్ ఇన్ స్పెక్టర్ కు ఫిర్యాదులు చేసినా నిర్లక్ష్యంగానే ఉంటున్నారని ఆరోపించారు. చిక్కడపల్లి పోలీసులు వెళ్లి బావర్చి హోటల్​వద్ద ఆందోళన చేస్తున్న వారిని పంపించి వేసి హోటల్​ ను మూసివేయించారు. వారం కిందట ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కూడా ఇదే హోటల్​ లో బిర్యానీ తిని వెళ్లినది తెలిసిందే.