దొంగల ముఠా అరెస్ట్.. పిస్టల్ స్వాధీనం

దొంగల ముఠా అరెస్ట్.. పిస్టల్ స్వాధీనం

హర్యాణా: ఓ దొంగల మూఠాను అరెస్ట్ చేశారు హర్యాణా పోలీసులు.  వీరినుంచి మూడు కంట్రీమేడ్ పిస్టల్స్, రెండు లైవ్ కాట్రిజెస్, షార్ప్ ఎడ్జెడ్ వెపన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటన సోమవారం మద్యాహ్నం  హర్యాణాలోని సోనిపట్ లో వీరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. పక్కా సమాచారంతో  దాడిచేసి వీరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ ఐదుగురు ముఠాగా ఏర్పడి హర్యాణాలో పలు నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ముఠాను అరెస్ట్ చేసి కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.