పిల్లిని చూసి చిరుత అనుకుని…

పిల్లిని చూసి చిరుత అనుకుని…

శంషాబాద్​ విమానాశ్రయం.. ప్రయాణికులు, అధికారుల చెకప్​లతో బిజీబిజీగా ఉంది. ఇంతలోనే ఓ ప్రయాణికుడు భయంతో పరుగులు తీశాడు. అతడి వెనకే మరికొందరూ దౌడు అందుకున్నారు. పిల్లిని చూసి చిరుత అనుకుని పరుగులు పెట్టారు. అధికారులూ, సిబ్బంది ఆందోళన చెందారు. వెంటనే ఫారెస్ట్​ అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లొచ్చి.. అబ్బే అది చిరుతపులి కాదు, పిల్లి అని తేల్చేశారు. అధికారులు, ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ అడవి పిల్లిని పట్టుకున్న ఫారెస్ట్​ అధికారులు జూకు తీసుకెళ్లిపోయారు.

మరిన్ని వార్తల కోసం