ఏపీ: లారీ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందిన సంఘటన వైజాగ్ లో జరిగింది. లంకెలపాలెం జంక్షన్ లో తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. రెండింటిలో ఒకటి బొగ్గు లారీ కావడంతో పూర్తిగా దగ్ధం కావడంతో డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం వైజాగ్ హస్పిటల్ కి తరలించారు. మరో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రమాదంలో ఓ లారీ కాలి బూడదకాగా..మరో లారీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు పోలీసులు.