అత్తాపూర్లో లారీ బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అత్తాపూర్లో లారీ బీభత్సం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్లో ఓ లారీ బీభత్సం సృష్టించాయి. ఫిబ్రవరి 19వ తేదీ సోమవారం తెల్లవారుజామున అత్తాపూర్ పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ పిల్లర్133 పిల్లర్ దగ్గర వేగంగా దసూకొచ్చిన ఓ లారీ.. టిప్పర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్డుపై లారీని తరలించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. లారి బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.