భిక్కనూరు టోల్​ప్లాజా వద్ద..లారీ బీభత్సం

భిక్కనూరు టోల్​ప్లాజా వద్ద..లారీ బీభత్సం

భిక్కనూరు, వెలుగు :  భిక్కనూరు టోల్​ప్లాజా వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో టోల్​గేట్‌‌ బూత్‌‌రూంతో పాటు అందులో ఉన్న కంప్యూటర్లు ధ్వంసమయ్యాయి.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  

నాగపూర్‌‌‌‌ నుంచి హైదరాబాద్‌‌ వైపు వెళ్తున్న ఓ లారీ ప్రమాదవశాత్తు టోల్‌‌గేట్‌‌ బూత్‌‌ రూంను ఢీకొట్టింది.  దీంతో అందులో ఉన్న బాబు అనే వ్యక్తికి గాయాలు కాగా..  బాల్ రెడ్డి అనే వ్యక్తి తప్పించుకోవడంతో ప్రాణపాయం తప్పింది.