
తల్లిదండ్రులు ప్రేమను అంగీకరించలేదని ఈ మధ్య యువతీయువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కలిసి నడవాల్సిన జీవితాన్ని అర్థాంతరంగా చనువు చాలిస్తున్నారు.లేటెస్ట్ గా యాదాద్రి జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు శివారులోని రాగల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు ప్రేమికులు. రిసార్ట్ సిబ్బంది ఎంత కొట్టినా డోర్ తీయకపోవడంతో తలుపులు బద్దలు కొట్టడంతో ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారు.
ALSO READ | పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్.. ఆందోళనలో టీటీడీ అధికారులు..
వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు రామంతపూర్ కేసీఆర్ నగర్ కు చెందిన బాల సుధాకర్ , ఉప్పల్ లోని గాంధీ నగర్ కు చెందిన పసల సుమీలగా గుర్తించారు. ఇద్దరు కూడా మూడు రోజుల క్రితం రాగల రీస్టార్స్ వచ్చిన మృతులిద్దరు ఆత్మహత్యకు ముందు బంధువులకు సెల్ఫీ వీడియో తీసి పంపారు. ప్రేమే కారణామా.?ఇంకేదైనా కోణం ఉందా అనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.