పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్.. ఆందోళనలో టీటీడీ అధికారులు..

పాము కాటుకు గురైన తిరుమల స్నేక్ క్యాచర్ భాస్కర్.. ఆందోళనలో టీటీడీ అధికారులు..

తిరుమల ఆస్థాన స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు మళ్ళీ పాము కాటుకు గురయ్యారు. ఇప్పటికే పలుమార్లు పాము కాటు వల్ల చావు అంచులదాకా వెళ్లొచ్చిన భాస్కర్ నాయుడు మళ్ళీ పాము కాటుకు వల్ల ఆసుపత్రిలో చేరడంతో టీటీడీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదకరమైన, విషపూరిత పాములను సైతం సులువుగా బందించడంలో దిట్ట అయిన భాస్కర్ కు వేల సంఖ్యలో పాములు పట్టిన అనుభవం ఉంది. శుక్రవారం ( జూన్ 27 ) కోబ్రా పాము కాటుకు గురైన భాస్కర్ నాయుడును తిరుపతిలోని ఓ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుమల కొండపై భక్తులు బస చేసే వసతి గదులు, కోదండరామ స్వామి ఆలయం, కపిలతీర్థం ఎస్వీ యూనివర్సిటీ, రుయా హాస్పిటల్, స్విమ్స్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ పాము కనిపించినా భాస్కర్ నాయుడు క్షణాల్లో అక్కడికి చేరుకుంటాడు. చాకచక్యంగా పాములు పట్టి శేషాచలం అడవుల్లో వదిలేస్తుంటారు భాస్కర్ నాయుడు. ఈ క్రమంలో శుక్రవారం కోబ్రా పాము కాటుకు గురయ్యారు భాస్కర్ నాయుడు. దీంతో తిరుమలలోని అపోలో క్లినిక్ లో ప్రధమ చికిత్స అందించిన అధికారులు అమర ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

శుక్రవారం గోగర్భ డ్యామ్ సమీపంలో ఉన్న పార్క్ లో విషపూరిత కోబ్రా పామును పట్టుకున్నారు భాస్కర్. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన భాస్కర్ పామును పట్టుకొని బ్యాగులో వేసుకునే సమయంలో భాస్కర్ ఎడమ చేతికి కాటేసింది కోబ్రా.దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు భాస్కర్. పాము కాటేసిన రెండు నిమిషాలకే భాస్కర్ స్పృహ కోల్పోయినట్లు తెలుస్తోంది. 

►ALSO READ | తిరుమలలో యథేచ్ఛగా దళారీల దందా... శ్రీవారి సేవ టికెట్ల పేరుతో భక్తులకు టోకరా..

భాస్కర్ నాయుడు గోగర్భం డ్యామ్ సమీపంలోని పార్క్ లో ఉన్న విషపూరితమైన కోబ్రా ను పట్టుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న భాస్కర్ నాయుడు.. కోబ్రా ను పట్టుకొని బ్యాగులో వేసుకునే సమయంలో భాస్కర్ నాయుడు ఎడమ చేతిని కోబ్రా కాటేసింది. ఎప్పుడు సరదాగా పాములు పట్టుకున్న వెంటనే వాటితో ఆడుకుంటూ తీసుకెళ్లే భాస్కర్ నాయుడు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పాము కాటేసిన రెండు నిమిషాలకే స్పృహ కోల్పోయాడు.

భాస్కర్ పాము కాటుకు గురవ్వడం ఇది తొలిసారి కాదు.. 2022లో కూడా పింజర పాము కాటెయ్యడంతో అస్వస్థతకు గురయ్యారు భాస్కర్. అప్పట్లో చావు అంచుల దాకా వెళ్లిన భాస్కర్ వైద్యుల పర్యవేక్షణలో బతికి బయటపడ్డారు. ఈ క్రమంలో భాస్కర్ మరోసారి పాము కాటుకు గురవ్వడం పట్ల టీటీడీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.