రెండు రోజుల వ్యవధిలో బావ, మరదలు మృతి

రెండు రోజుల వ్యవధిలో బావ, మరదలు మృతి

పెళ్లికి పెద్దలు ఒప్పుకొవటం లేదని 4 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం.. చికిత్స పొందుతూ మృతి
కామారెడ్డి , వెలుగు: పెళ్లికి పెద్దలు ఒప్పుకొవటం లేదని భావించి బావ, మరదళ్లు 4 రోజుల క్రితం పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నంకు పాల్పడగా చికిత్స పొందుతూ 2 రోజుల వ్యవధిలో ఇద్దరు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి స్థానికులు , పోలీసు వర్గాలు తెలిపిన ప్రకారం.. కామారెడ్డి మండలం అడ్లూర్కు చెందిన రమ్య(19), గాంధారి మండలం పొతంగల్కలాన్ వాసి సాయికుమార్ (21) వరుసకు బావమరుదళ్లు. వీరిద్దరు పెళ్లి చేసుకొవాలని అనుకున్నారు. ఇందుకు పెద్దలు ఒప్పుకొలేదని తెలిసింది. యువతికి వేరే పెళ్లి సంబంధాల్ని ఆమె కుటుంబీకులు చూస్తున్నారు.

ఈ క్రమంలో ఈనెల 11న సాయికుమార్, రమ్యలు గాంధారి మండలం గండివేట్ శివారులో పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా హస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరింత మెరుగైన చికిత్స కోసం కరీంనరగ్ జిల్లాలోని ఓ ప్రైవేట్ హస్పిటల్కు అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం హస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రమ్య, సోమవారం సాయికుమార్ మృతి చెందినట్లు తెలిపారు. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.