రేపే ఎల్పీసెట్

రేపే ఎల్పీసెట్

హైదరాబాద్, వెలుగు: ఐటీఐ స్టూడెంట్లకు పాలిటెక్నిక్ సెకండియర్ ప్రవేశాల అరత పరీక్ష ఎల్పీసెట్ 2020ని ఈ నెల 6న నిర్వహిస్తున్నట్టు టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డు సెక్రటరీ డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ –1, మధ్యాహ్నం రెండున్నర నుంచి నాలుగున్నర వరకు పేపర్–2 ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే ఎగ్జామ్సెంటర్ ఉంటుందన్నారు.