
అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ఘటన జరిగి 24 గంటలు కాకముందే పంజాబ్ లో ఆర్మీ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కలకలం రేపింది. శుక్రవారం ( జూన్ 13 ) M 17 ఆర్మీ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కారణంగా పఠాన్ కోట్ లో అత్యవసర ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో హెలికాఫ్టర్ సేఫ్ గా ల్యాండ్ అయ్యిందని.. హెలికాఫ్టర్ లో ప్రయాణిస్తున్నవారంతా సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదమేమీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండవ ఘటన కావడం ఆందోళన కల్గించే అంశం.
🚨 Pathankot, Punjab: An Apache helicopter of the Indian Air Force (IAF) made EMERGENCY landing in Nangalpur area.
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 13, 2025
— More details are awaited. pic.twitter.com/bfJzjAL2rC
ఇదిలా ఉండగా.. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. దీంతో థాయిలాండ్ లో విమానం అత్యవసర ల్యాండింగ్ అయినట్లు తెలుస్తోంది. బాంబు బెదిరింపు కాల్ వచ్చిన తర్వాత కొద్దిసేపు అండమాన్ సముద్రంపై చక్కర్లు కొట్టింది విమానం. విమానంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. విమానంలో 156 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ ఘటన జరిగి 24 గంటలు కూడా కాకముందే బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.