మోహన్ వడ్లపడ్ల దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ఎమ్ ఫర్ ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలో విడుదలైంది.
ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జూన్ 19 నుంచి లయన్స్గేట్ ప్లేలో ప్రీమియర్ కానుందని ప్రకటించారు. సీరియల్ కిల్లర్ చుట్టూ ఈ కథ సాగుతుంది. శుభలేఖ సుధాకర్, సత్యకృష్ణన్, గీతా భాస్కర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ చిత్రం లయన్స్గేట్ ప్లే ద్వారా మరింత మంది ప్రేక్షకులకు చేరువవుతుండటం ఎంతో సంతోషంగా ఉందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
