నిర్మాత మోహన్ వడ్లపడ్ల దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘ఎమ్ ఫర్ ఎమ్’ (మోటివ్ ఫర్ మర్డర్). ఒడిశా సూపర్ స్టార్ సంబీట్ ఆచార్య, అమెరికన్ హీరోయిన్ జో శర్మ జంటగా రూపొందిన ఈ మూవీని పాన్ ఇండియా వైడ్గా మే 8న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర అతిథులుగా హాజరై మూవీ టీమ్కు బెస్ట్ విషెస్ చెప్పారు.
దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్, క్లైమాక్స్ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నాం. ఇందులో సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ ప్రకటిస్తున్నాం’ అని అన్నారు. హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ ‘అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డా. ఇప్పటికే ఈ చిత్రానికి 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు రావడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది. టీమ్ అంతా పాల్గొన్నారు.
