కాశీ నగరాన్ని ముంచిన గంగ.. నేతన్నల కష్టాలు

కాశీ నగరాన్ని ముంచిన గంగ.. నేతన్నల కష్టాలు

కాశీ విశ్వేశ్వరుడు కొలువైన వారణాసి నగరాన్ని గంగా నది దాదాపుగా ముంచేసింది. గంగా నదిలో ప్రవాహం పెరిగిపోవడంతో… కాశి నగరంలోని లోతట్టు ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. వందల సంఖ్యలో భవనాలు నీట మునిగాయి.

వారణాసిలో చాలా భవనాల్లోని మొదటి అంతస్తులోకి నీళ్లు చేరాయి. నగరం లోతట్టు ప్రాంతాల్లో నేత పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ తయారుచేసే బట్టలకు దేశమంతటా ఎంతో మార్కెట్ ఉంటుంది. ఐతే… తమ నేత మెషీన్లు , పరికరాలు మొత్తం వరదలో తడిసిపోయాయని అంటున్నారు నేత కార్మికులు. మెషీన్లను క్లీన్ చేసుకోవడానికి నెలలు పడుతుందని చెప్పారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు తయారీదారులు.