రెవెన్యూ డివిజన్​ సాధించేవరకు ఉద్యమం ఆగదు

రెవెన్యూ డివిజన్​ సాధించేవరకు ఉద్యమం ఆగదు

చేర్యాల, వెలుగు:  చేర్యాల రెవెన్యూ డివిజన్​ సాధించేవరకు ఉద్యమం ఆగదని మద్దూరు జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్​ లీడర్​ గిరి కొండల్​రెడ్డి, జేఏసీ చైర్మన్​ పరమేశ్వర్​, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు.  గురువారం మండల కేంద్రంలోని పాత బస్టాంట్​వద్ద​32 వ రోజు దీక్షల్లో సీపీఎంసభ్యులు, కార్యదర్శులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్​ కారణంగా రిలే దీక్షల శిబిరాన్ని  తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్​ తర్వాత మళ్లీ శిబిరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వెంకటమావో, సత్తిరెడ్డి, అరుణ్​కుమార్​, కృష్ణారెడ్డి, రవి కుమార్​, భాస్కర్ పాల్గొన్నారు. 

బీఆర్​ఎస్​ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది:  ఎమ్మెల్సీ పల్లా 


చేర్యాల రెవెన్యూ డివిజన్​ ను బీఆర్​ఎస్​ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి  అన్నారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఉద్యమించినా ఉద్యమించకపోయినా డివిజన్​ ఏర్పాటు జరుగుతుందని హామిఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకెళ్లానని, టెక్నికల్​ కారణంగా ఆగిందని తెలిపారు. కార్యక్రమంలో మల్లేశం, నాగేశ్వర్​రావు, ఎంపీపీ కర్ణాకర్​, స్వరూపరాణి,  రాజీవ్​రెడ్డి, చంటి, నరేందర్​, జుబేదా ఖతూర్​, కనకమ్మ, సతీశ్​గౌడ్​, ఎల్లారెడ్డి, కృష్ణవేణి, మమతారాంరెడ్డి,  బాల్​రాజు, బాలనర్సయ్య, శ్రీధర్​రెడ్డి, వెంకట్​రెడ్డి, అంజయ్య, పాల్గొన్నారు.