మాదాపూర్ శిల్పారామంలో ఆదివారం సాయంత్రం జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. వెంపటి లక్ష్మీ శ్రీనివాస శాస్త్రి మెమోరియల్ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంపటి లక్ష్మీ నారాయణ శర్మ ఆధ్వర్యంలో ‘ శాస్త్రీయ సంగీత సాహిత్య సమ్మేళనం’ 9వ వార్షిక వేడుకలను నిర్వహించారు.
ఇందులో భాగంగా వేదవతి ప్రభాకర్ శిష్య బృందం సంగీత కచేరి, వెంపటి చిన్న సత్యం కుమార్తె చావలి బాల త్రిపురసుందరి శిష్య బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం సందర్శకులను అలరించింది. - వెలుగు, మాదాపూర్