మధిరలో20 మందికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ

 మధిరలో20 మందికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులు పంపిణీ

మధిర, వెలుగు: డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సూరంశెట్టి కిశోర్ పంపిణీ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధిర, అల్లీనగరం, ఖమ్మంపాడు, కృష్ణాపురం, మహదేవపురం, సిరిపురం, సిద్దినేనిగూడెం గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు రూ.8 లక్షల 49 వేల విలువైల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్​ కార్యకర్తలు పాల్గొన్నారు.