అక్టోబర్ 13న  మధురపూడి గ్రామం అనే నేను రిలీజ్ 

అక్టోబర్ 13న  మధురపూడి గ్రామం అనే నేను రిలీజ్ 

శివ కంఠమనేని,  క్యాథ‌‌లిన్ గౌడ జంటగా ‘కత్తి’ ఫేమ్ మల్లి ద‌‌ర్శక‌‌త్వంలో  కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. అక్టోబర్ 13న సినిమా విడుదల  కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేసిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్‌‌గా, ఎమోష‌‌న్స్‌‌తో నిండి ఉంది.

శివ కంఠ‌‌మ‌‌నేని  క్యారెక్టర్‌‌కి ప‌‌ర్‌‌ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. మణిశర్మ మ్యూజిక్, గౌతమ్ రాజు ఎడిటింగ్ హైలైట్‌‌గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. మ‌‌నుషుల‌‌కి ఆత్మలు ఉన్నట్టే.. ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ త‌‌న క‌‌థ తానే చెబితే ఎలా ఉంటుంది అనే క‌‌థాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు.  డిఫరెంట్ స్ర్కీన్‌‌ప్లే బేస్డ్ సినిమా ఇది అని దర్శక నిర్మాతలు చెప్పారు.