శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా ‘కత్తి’ ఫేమ్ మల్లి దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. అక్టోబర్ 13న సినిమా విడుదల కానుంది. శనివారం ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేసిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా ఇంటరెస్టింగ్గా, ఎమోషన్స్తో నిండి ఉంది.
శివ కంఠమనేని క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించారు. మణిశర్మ మ్యూజిక్, గౌతమ్ రాజు ఎడిటింగ్ హైలైట్గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’ అని చెప్పారు. మనుషులకి ఆత్మలు ఉన్నట్టే.. ఒక ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. డిఫరెంట్ స్ర్కీన్ప్లే బేస్డ్ సినిమా ఇది అని దర్శక నిర్మాతలు చెప్పారు.