దీదీ ఇలాఖాలో బీజేపీ గెలుపు పక్కా

దీదీ ఇలాఖాలో బీజేపీ గెలుపు పక్కా

ఇండోర్: దీదీ కోటలో మోడీ పాగా వేయడం ఖాయమని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. బెంగాల్ ఎన్నికల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బెంగాల్‌‌లో మార్పు సూచనలు కనిపిస్తున్నాయని చెప్పారు. ‘రైతులు, పేదలకు కేంద్ర పథకాల ద్వారా చేకూరే లబ్ధిని టీఎంసీ అడ్డుకుంది. ఆ రాష్ట్రంలో హింస, అవినీతి ఎక్కువగా ఉంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్, ఆ తర్వాత తృణమూల్ బెంగాల్‌‌ను నాశనం చేశాయి. మే 2ను గుర్తు పెట్టుకోండి.. దీదీ ఇలాఖాలో బీజేపీ గెలుస్తుంది’ అని శివరాజ్ పేర్కొన్నారు.