మధ్యప్రదేశ్ తొలి మహిళా చీఫ్ సెక్రటరీ నిర్మలా బుచ్ కన్నుమూత

 మధ్యప్రదేశ్  తొలి మహిళా చీఫ్ సెక్రటరీ  నిర్మలా బుచ్ కన్నుమూత

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి,  మధ్యప్రదేశ్ రాష్ట్ర తొలి మహిళ చీఫ్ సెక్రటరీ నిర్మలా బుచ్ కన్నుముశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. 2023 జూలై 09  ఆదివారం కన్నుముశారు.   ఈ విషయాన్ని  ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.  

1960 బ్యాచ్ కు చెందిన   నిర్మలా బుచ్ కు ప్రస్తుతం 90 ఏళ్లు. ఆమె భర్త ఎంఎన్ కూడా  ఐఏఎస్ అధికారినే. వీరికి ఒక్క కుమారుడు ఉన్నాడు.   నిర్మలా బుచ్ మృతి పట్ల  మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం తెలిపారు.  

ఆమె పరిపాలన చిత్తశుద్ది, పరిపాలనా దక్షత అద్భుతమని  కొనియాడారు. చీఫ్ సెక్రటరీ గానే కాకుండా సామాజిక కార్యకర్తగా బుచ్ పాత్ర ఎప్పటికీ మరువలేనిదని అన్నారు. ఆమె పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.