మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి.. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలి.. సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గంలో మాదిగ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం జూబ్లీహిల్స్​ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర కేబినెట్‌లో తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని వారు సీఎంకు విజ్ఞప్తి చేశారు. 

ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఉన్నారు.