పాలమూరు మెడికల్​ కాలేజీకి షాక్.. కొత్త అడ్మిషన్లు తీసుకోకుండా మెడికల్​బోర్డు ఆదేశాలు

పాలమూరు మెడికల్​ కాలేజీకి షాక్.. కొత్త అడ్మిషన్లు తీసుకోకుండా మెడికల్​బోర్డు ఆదేశాలు
  • నిబంధనలు పాటించలేదనే..అప్పీల్​చేశామన్న కాలేజ్​డైరెక్టర్​ 

మహబూబ్​నగర్​, వెలుగు : మహబూబ్​నగర్ ​గవర్నమెంట్ ​మెడికల్ ​కాలేజీలో ఎంబీబీఎస్ ​డిగ్రీ సీట్లకు సంబంధించి కొత్త అడ్మిషన్ల రికగ్నైజేషన్​ను డిస్​అప్రూవల్​ చేస్తున్నట్లు అండర్ ​గ్రాడ్యుయేట్ ​మెడికల్​ఎడ్యుకేషన్​ బోర్డు డైరెక్టర్ ​శంభుశరన్​కుమార్​ఈ నెల 16న లెటర్​ఇష్యూ చేశారు. కాలేజీలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్​ విధానాన్ని ఎన్ఎంసీ పోర్టల్​కు లింక్​ చేయలేదని అందులో పేర్కొన్నారు. ఫ్యాకల్టీకి సంబంధించిన వివరాలు ఆధార్ ​ఎనేబుల్డ్​బయోమోట్రిక్​ సిస్టంలో పొందుపర్చలేదని సీరియస్​అయ్యారు. 

దీనిపై కాలేజ్ డైరెక్టర్​ ఎం.రమేశ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీసీ కెమెరాలు, బయోమెట్రిక్​ మెషీన్​లను కాంట్రాక్టర్ ​ఫీడ్ ​చేసి వెళ్లారని, ఇన్​స్టాలేషన్​ మాత్రం చేయలేదన్నారు. బుధవారం 12  సీసీ కెమెరాలు, బయోమెట్రిక్​ మెషీన్​లను ఎన్ఎంసీ పోర్టల్​కు లింక్​ చేశామన్నారు. ఎన్ఎంసీకి మెయిల్​ కూడా పంపామన్నారు. రికగ్నైజేషన్​డిస్​అప్రూవల్​పై ఈనెల 17న అప్పీల్​ చేశామన్నారు.