జల దిగ్బంధంలో మహానంది ఆలయం

జల దిగ్బంధంలో మహానంది ఆలయం

కర్నూలు జిల్లాలోని మహానంది ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయంలోని మొదటి, రెండో ప్రాకారంలోకి వరద నీరు ప్రవేశించింది. నీట మునగడంతో పంచలింగాల మంటపం, కోనేరు వరదలతో మహానంది ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వరద నీరు భారీగా వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరుకుంది. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని… లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేస్తున్నారు.