
ఎమర్జెన్సీ టైంలో జైల్లో ఉన్న వారికి పెన్షన్ డబుల్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం..అత్యవసర పరిస్థితి కాలంలో జైలు శిక్ష అనుభవించిన వారికి గౌరవ వేతనాన్ని రెట్టింపు చేస్తూ మంగళవారం (జూన్ 17) కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది.జైలులో ఉన్న వ్యక్తి చనిపోతే వారి భాగస్వామికి కూడా పెన్షన్ ప్రకటించింది. ప్రస్తుతం గౌరవ్ యోజన పథకం కింద లబ్ధిదారులకు అందిస్తున్న పెన్షన్ ను డబుల్ చేసింది ఫడ్నవీస్ ప్రభుత్వం.
ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తున్న ఎమర్జెన్సీ టైం ( 1975-77) వరకు ఒక నెల జైలు శిక్ష అనుభవించిన వారికి మహారాష్ట్రప్రభుత్వం రూ. 5వేల పెన్షన్ ఇస్తోంది. అంతకంటే ఎక్కువ కాలం జైలు జీవితం గడిపిన వారికి రూ. 10వేల పెన్షన్ ఇస్తోంది. ఇప్పటివరకు ఉన్న పెన్షన్ ను ఫడ్నవీస్ ప్రభుత్వం మంగళవారం (జూన్ 17) డబుల్ చేసింది.
ALSO READ | COVID-19: దేశంలో వరుసగా మూడోరోజు తగ్గిన కోవిడ్ కేసులు..మరణాలు పెరిగాయి.!
పథకం రూల్స్ ప్రకారం.. జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి మరణిస్తే అతని భాగస్వామికి రూ. 2500(ఒక నెల జైలు శిక్షకు), ఒక నెల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవించిన వారి భాగస్వామికి పెన్షన్ కింద రూ. 5వేలు ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
గౌరవ్ యోజన పథకాన్ని ఫడ్నవీస్ తన మొదటి పదవీకాలంలోనే ప్రారంభించారు.అయితే ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఈ పెన్షన్ పథకాన్ని రద్దు చేసింది. అయితే 2022లో ఏక్ నాథ్ షిండే , ఫడ్నవీస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి ఈ పథకాన్ని ప్రారంభించారు. అర్హత ఉన్నవారు రూ. 100 స్టాంపు పేపర్ పై జిల్లా కలెక్టరేట్ కు దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని ఫడ్నవీస్ తెలిపారు.