
దేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త వేరియంట్లు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం కనిపిస్తోంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం వరుసగా మూడవ రోజు కూడా యాక్టివ్ కరోనా కేసులలో తగ్గుదల నమోదైంది. గత 24 గంటల్లో 428 కొత్త కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 6,836కి తగ్గాయి. సోమవారం కోవిడ్ బారిన పడి ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 836యాక్టివ్ కేసులున్నాయి. 14వేల 772 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ బారిన పడి ఇప్పటివరకు 109 మంది మృతిచెందారు.
#COVID19 was a vivid demonstration that the production of vaccines and other lifesaving tools is concentrated in too few countries.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) June 12, 2025
The @WHO mRNA Technology Transfer Programme was created to address that gap and is building capabilities in low- and middle-income countries. pic.twitter.com/UU5OaqSeyO
ప్రస్తుత యాక్టివ్ కేసుల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది.102 తాజా కేసులు నమోదు కాగా..దాని యాక్టివ్ కేసులు 1659కి చేరాయి. ఇది దేశంలోని మొత్తంలో ఎక్కువ. మరోవైపు ఢిల్లీలో కొత్త గా10 కేసులు నమోదయ్యాయి. దీనితో యాక్టివ్ కేసులు 555కి చేరుకున్నాయి .
సోమవారం నాటికి ఆంధ్రప్రదేశ్లో 77 యాక్టివ్ కేసులుండగా.. 176 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో ఎటువంటి యాక్టివ్ కేసులు నమోదు కాలేదు. అసోంలో 22 యాక్టివ్ కేసులుండగా 24 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక బీహార్లో 37 యాక్టివ్ కేసులు ఉండగా సోమవారం 69 మంది కోవిడ్ నుంచి బయటపడ్డారు.
ALSO READ | జనగణనపై గెజిట్ నోటిఫికేషన్ .. 2026, అక్టోబర్ 1 అర్ధరాత్రి నుంచి జనగణన ప్రారంభం
చండీగఢ్లో సోమవారం 1కేసు నమోదు కాగా.. ప్రస్తుతం 51యాక్టివ్ కేసులున్నాయి. ఢిల్లీలో 555 యాక్టివ్ కేసులుండగా కోవిడ్ బారినుంచి అందరూ కోలుకున్నారు. గోవాలో 5 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక కోవిడ్ కేసులు కేరళలో అత్యధికంగా1659 కేసులున్నాయి. తర్వాత గుజరాత్లో 1248 యాక్టివ్ కేసులున్నాయి.
కర్ణాటకలో 696 కేసులు, హర్యానాలో 103, హిమాచల్ ప్రదేశ్లో 0 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ప్రస్తుతం 137 యాక్టివ్ కేసులు, మహారాష్ట్రలో 512 కేసులు నమోదయ్యాయి. మణిపూర్ ,త్రిపురలో యాక్టివ్ కేసులు తక్కువగా ఉండగా, పశ్చిమ బెంగాల్లో 747 ఉన్నాయి.