హైదరాబాద్, వెలుగు: ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం పరామర్శించారు. పవన్ కల్యాణ్తో మాట్లాడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ ఆకాంక్షించారు.
