రామ్ చరణ్తో రీమిక్స్.. మంచి టార్గెట్ పెట్టుకున్న మహతి

రామ్ చరణ్తో రీమిక్స్.. మంచి టార్గెట్ పెట్టుకున్న మహతి

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా చేస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar). టాలీవుడ్ స్టైలీష్ డైరెక్టర్ మెహర్ రమేష్(Meher Ramesh) తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11 నుండి థియేటర్స్ లో ఆడియన్స్ ను అలరించనుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన ట్రైలర్ అండ్ సాంగ్స్ కు సూపర్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 

ఇక భోళా శంకర్ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్. ఇందులో భాగంగానే చిత్ర యూనిట్ వరుస ఇంటర్వూస్ అటెండ్ అవుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భోళా శంకర్ సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్(Mahati Swara Sagar) సినిమా గురించి, మెగాస్టార్ చిరంజీవితో తన ప్రయాణం గురించి, తండ్రి మణిశర్మ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. చిరంజీవి, మణిశర్మ(Manisharma) కాంబోలో వచ్చిన సినిమా ల్లో ఇంద్ర(Indra), మృగరాజు(Mrugaraju) అంటే చాల ఇష్టం అని చెప్పిన మహతి.. ఇంద్ర సినిమాను దాదాపు 500 సార్లు చూసినట్టు చెప్పుకొచ్చారు. 

ఆ సినిమాలో రాధే గోవిందా(Radhe govinda song) అనే సాంగ్ తన ఆల్ టైం ఫెవరెట్ అని, ఒక వేళా అవకాశం వస్తే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్(Ram charan) తో ఆ సాంగ్ ని రీమిక్స్ చేస్తానని చెప్పుకొచ్చారు. అది కూడా కేవలం రామ్ చరణ్ తో మాత్రమే అని వివరించారు. ప్రస్తుతం మహతి స్వర సాగర్ చేసిన ఈ  కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా తప్పకుండా రామ్ చరణ్ కోసం ఈ పాటను రీమిక్స్ చేయన్నా. అలాంటి క్లాసిక్ హిట్ సాంగ్ కు చరణ్ స్టెప్పులు వేస్తే నెక్స్ట్ లెవల్లో ఉటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక ఫలించి.. ఈ సాంగ్ రామ్ చరణ్ తో ఈ సాంగ్ రీమిక్స్ చేస్తే.. రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయం.