మహేశ్ డ్యాన్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్

మహేశ్ డ్యాన్స్ కు ఫిదా అయిన ఫ్యాన్స్

తెలుగు సినీ పరిశ్రమలో డీసెంట్ అండ్ సింపుల్ స్టార్ హీరోలలో ఒకరైన సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించడం షరా మామూలే. అదే ఉత్సాహంతో హీరో మహేశ్ బాబు ప్రధాన పాత్రలో వచ్చిన  సర్కారు వారి పాట సినిమా ఇటీవలే విడుదలై  కలెక్షన్ల సునామీని సృష్టించింది. పరశురామ్ దర్శకత్వంలో మే 12న రిలీజైన ఈ మూవీ ప్రారంభం నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని, తొలి రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం గమనార్హం. 

ఇదిలా ఉండగా ఎప్పుడూ సింపుల్ గా, స్మార్ట్ గా కనిపించే మహేశ్, వేదికలపైకి వచ్చేసరికి మాత్రం ఎంత సైలెంట్ గా ఉంటాడో అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మహేశ్ తన ట్రెండ్ మార్చినట్టు తెలుస్తోంది. ఆయనే కాదు, అందుకు తగ్గట్టుగానే అభిమానుల కోసం తన స్టైల్లో స్టెప్పులు వేసి అలరించారు. సినిమాల్లో తప్ప ఇంతకు మునుపెప్పుడూ స్టేజీలపై డ్యాన్స్ జోలికి పోని మహేశ్ ఈ సారి ఏకంకా తన మాస్ డ్యాన్స్ తో కుర్రకారును ఉర్రూతలూగించారు. సర్కారు వారి పాట సినిమా సక్సెస్ మీట్ నేపథ్యంలో మమ.. మహేశా సాంగ్ కు మహేశ్ వేసిన స్టెప్పులు అందర్నీ ఆకర్షించాయి. కర్నూలులో జరిగిన ఈ ఈవెంట్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సైతం డ్యాన్స్ చేయడాన్ని అభిమానులు ఆసక్తిగా వీక్షించారు.

మరిన్ని వార్తల కోసం...

అమెజాన్ ప్రైమ్ లో కేజీఎఫ్ 2 ... కానీ ఓ నిబంధన.. !

777ఛార్లీ ట్రైలర్ వచ్చేసింది...