
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram) కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం(Guntur kaaram). శ్రీలీల(Sreeleela), మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ వచ్చింది. సినిమాలో మహేష్ ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్ లో కనిపించి ఆడియన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. దాంతో.. థియేటర్స్ వద్ద రచ్చ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్.
Mahesh Babu at His Fort #Sudarshan35MM ??pic.twitter.com/wKPE3859uB
— Milagro Movies (@MilagroMovies) January 12, 2024
ముఖ్యంగా మహేష్ బాబు ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ లో ఆ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. ఆ హంగామాను చూడడానికి మహేష్ బాబు ఫ్యామిలీ పలుమార్లు అక్కడికి వచ్చి అభిమానులతో సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో భాగంగానే.. నేడు రిలీజైన గుంటూరు కారం సినిమా చూసేందుకు మహేష్, నమ్రత, ఫ్యామిలీతో కలిసి సుదర్శన్ థియేటర్ కి వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.