
- పోలీసుల విచారణలో మిహిర్ షా
- నేరం ఒప్పుకున్న హిట్ అండ్ రన్ కేసు నిందితుడు
ముంబై: ముంబై హిట్ అండ్ రన్ కేసు నిందితుడు మిహిర్ షా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న అతడు.. ఆ రోజు ఏం జరిగిందనేది విచారణలో వెల్లడించాడు. ఈ సందర్భంగా ‘ఇక నా కెరీర్ ముగిసింది’ అని మిహిర్ షా ఆవేదన చెందినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. ‘‘యాక్సిడెంట్ జరిగిన రోజు (ఈ నెల 7) మిహిర్ షా జుహు ఏరియాలోని బార్ లో ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తాగాడు. ఆ తర్వాత మరో బార్ లో మద్యం తాగాడు. మెరైన్ డ్రైవ్ లో జాయ్ రైడ్ కు వెళ్లాడు. వర్లీ ఏరియాలో స్కూటీని ఢీకొట్టాడు.
స్కూటీ నడుపుతున్న మహిళ కావేరీ నఖ్వా (45) కారులో ఇరుక్కుపోయింది. అది తెలిసినప్పటికీ కారును ఆపకుండా ముందుకుపోనిచ్చాడు. వాహనదారులు ఆరిచినప్పటికీ వినిపించుకోలేదు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. అలా 1.5 కిలోమీటర్ల దూరం వెళ్లాక కారు ఆపాడు. అక్కడ మహిళ మృతదేహాన్ని కారు కింది నుంచి లాగి, రోడ్డున పక్కన పడేశాడు. ఆ తర్వాత డ్రైవర్ సీటులో రాజ్ రిషి బిదావత్ ను కూర్చోబెట్టి, అక్కడి నుంచి పారిపోయాడు” అని పోలీస్ వర్గాలు చెప్పాయి.