యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్.. ఇద్దరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ లారీని వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్‎తో పాటు ఓ ప్రయాణికురాలు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

బస్ బ్రేక్ డౌన్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో బస్ ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.